ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, ఆ హత్య కేసును ఎలాగైనా త్వరగా క్లోజ్ చేయాలని స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు భావిస్తారు. ఈ క్రమంలో ఒక కమ్మరి తానే ఆ హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్కు వచ్చి లోంగిపోతాడు. అయితే, పైకి కనిపిస్తున్నట్లుగా ఈ కేసు అంత సులభం కాదని, దీని వెనుక ఎన్నో ఏళ్ల నాటి పగలు, ప్రతీకారాలు, మోసాలు ఉన్నాయని వాసుదేవన్కు అర్థమవుతుంది. ఆ విచారణ క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి.
