అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి.
