విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….
