ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో సెక్రటరీ పాత్ర పోషించిన నటుడు వినోద్ సూర్యవంశీ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుల వివక్ష గురించి దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలోని ఒక గ్రామంలో తాను, తన కుటుంబం కుల వివక్షను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు. ఈనాటికీ తమ కుటుంబాన్ని దేవాలయాల్లోకి గానీ, ఇతరుల ఇళ్లలోకి గానీ అనుమతించడం లేదని ఆయన చెప్పారు. ‘కర్ణాటకలోని మా గ్రామంలో కుల వివక్ష ఇప్పటికీ ఉంది. ఆ గ్రామంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి అగ్ర కులాల వారికి, మరొకటి నిమ్న కులాల వారికి. దళితుల ప్రాంతం గ్రామానికి వేరుగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసులో, నేను మా నాన్నతో కలిసి మా ఊరికి వెళ్లాను. అక్కడ మేము ఒక హోటల్లో భోజనం చేసి, మా గిన్నెలను మేమే కడుక్కోవాల్సి వచ్చింది. భోజనానికి బిల్లు కూడా మేమే చెల్లించాము. అయినా మమ్మల్ని అలాగే చూశారు. ఈ రోజుకీ మా ఊరిలో ఒక గుడి ఉంది, అక్కడికి మమ్మల్ని వెళ్లనివ్వరు. మా అమ్మానాన్నలు ఏడవడం నేను చాలా సార్లు చూశాను. పండుగలు వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ బాధగా అనిపించేది. దీపావళి లాంటి పండుగలు ఎందుకు వస్తాయా అని ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే మేము ఇతరుల్లా పండుగలు జరుపుకోలేకపోయేవాళ్ళం. అది ఇప్పటికీ బాధ అనిపిస్తోంది. మా పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఎవరైనా సహాయం చేస్తేనే మేము పండుగలు జరుపుకోగలిగేవాళ్లం’ అని ఎమోషనల్ అయ్యాడు వినోద్.
వినోద్ వినోద పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందు చిన్న చిన్న పనులు చేశాడు ‘మొదట నేను లిఫ్ట్మ్యాన్గా పనిచేశాను, దానికి నాకు నెలకు రూ. 1600 వచ్చేవి. ఆ తర్వాత ఆఫీస్ బాయ్గా, తర్వాత సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను. నేను 12 గంటల పాటు నిరంతరాయంగా డ్యూటీ చేసేవాడిని. కొన్నిసార్లు ప్రజలు నన్ను తిట్టేవారు. అయినా నేను ఆ తిట్లను భరించాను. ఏ పనీ చిన్నది కాదని ప్రజలు అంటారు, కానీ ఒక వ్యక్తి విలువ అతను చేసే పని స్థాయిని బట్టి ఉంటుందని నేను చూశాను. పని ఎంత పెద్దదైతే, అంత ఎక్కువ గౌరవం లభిస్తుంది,’ అని వినోద్ ఎమోషనల్ అయ్యాడు.
కాగా వినోద్ సూర్యవంశీ ‘జన్వర్’, ‘థమ’, ‘సత్యమేవ జయతే’, ‘జాలీ ఎల్ఎల్బి 3’ చిత్రాల్లో కూడా నటించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
