ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం.. నెలకు రూ.15 వేల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్వో చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి రూ.15 వేలుగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు.
