సిట్రస్ పండ్లతో ఎసిడిటీ ముప్పు: నారింజ, బత్తాయి, పైనాపిల్, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లలో సహజ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. పరగడుపున ఇవి తినడం వల్ల కడుపులోని లోపలి పొరలు ప్రభావితమై.. తీవ్రమైన అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత హాని చేస్తాయి. అందుకే సిట్రస్ పండ్లను ఎల్లప్పుడూ తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాతే తీసుకోవడం ఉత్తమం.
