వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
హైదరాబాద్లోని చెంగిచర్ల కాలనీలో సంక్రాంతి పండుగ సమయంలో భారీ దొంగతనం జరిగింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అంతర్రాష్ట్ర దొంగల ముఠా తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 10 ఇళ్లలో చోరీకి పాల్పడింది. దొంగలు కత్తులతో కాలనీలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో నగదు, నగలు అపహరించినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన తీరును బట్టి నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ముగ్గురు దొంగలు మంకీ…
