Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేసింది. దాదాపు లక్షల మంది రైతులకు రూ.1,173 కోట్లు అందించింది. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందిస్తోంది….
