Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను…
