కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్ నెంబర్ వన్గా నిలిచిన భారత్! ప్రపంచానికి అన్నపూర్ణగా..
భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…
