ఎంత పని చేశావ్ భారతీ.. కాసుల కోసం కక్కుర్తితో సుపారీ ఇచ్చిమరీ భర్త హత్య!
మంచిర్యాల, మే 27: భర్త పేరిట తీసుకున్న రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భార్యే కట్టుకున్న భర్త హత్యకు కుట్ర పన్నిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడిస్తూ సంచలన విషయాలను తెలిపారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన సాయిని కుమార్ (45) మే 22న ద్విచక్రవాహనంపై మంచిర్యాల వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108 అంబులెన్స్లో కరీంనగర్కు తరలిస్తుండగా…
