Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన గాలిదుమారం.. కుప్పకూలిన 120 ఏళ్ల దేవతా వృక్షాలు..
మార్కాపురం పరిసర ప్రాంతాల్లో గాలిదుమారంతో కూడిన వర్షం పంజా విసిరింది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా మారిన వాతావరణంతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మిట్టపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం విరిగిపడటంతో, త్రిపురాంతకం – యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు తీవ్ర…
