ఈడీ vs బెంగాల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. సీఎం మమత, పోలీసులకు నోటీసులు..
కోల్కతా ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాల విషయంలో బెంగాల్ సీఎం మమతకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై మమతతో పాటు బెంగాల్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవడం చాలా సీరియస్ వ్యవహారమని , దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఐప్యాక్ సంస్థలో సోదాల సీసీటీవీ దృశ్యాలను భద్రపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈడీ…
