Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. దీనిని రూ.5818.45 కోట్లతో నిర్మించనుండగా.. పీపీపీ పద్దతితో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంత ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తైతే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం…
