చీర ముక్క ఆధారంగా వృద్ధురాలి మిస్సింగ్ మిస్టరీని ఛేదించిన పోలీసులు..!
వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు వెంకటమ్మ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం బంగారు, వెండి నగల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పరిగి డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో బండవెల్కిచర్లకు చెందిన చిపిరి మంజుల, ఆమె భర్త భీరయ్య, వారి బంధువు అరుణ్ కుమార్ ప్రధాన నిందితులుగా తేలారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితులు ముగ్గురు కలిసి పథకం ప్రకారం కొత్తబావి వెంకటమ్మను హతమార్చినట్లు పోలీసులు…
