రాష్ట్రపతిని అగౌరవపరుస్తారా.. ఇదేం పద్దతి.. టీఎంసీ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఫైర్
బెంగాల్లోని టిఎంసి ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని అన్నారు. బెంగాల్లోని సిలిగురిలో రాష్ట్రపతి సమావేశానికి వేదిక లేకపోవడం, ప్రోటోకాల్ లేకపోవడంపై రాష్ట్రపతి కలతచెందారు. “బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం గురించి పట్టింపు లేదు, అందుకే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.” అని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రకటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…
