ఇరాన్ గడ్డపై భారత్ రహస్య వ్యూహం.. హోర్ముజ్ జలసంధిలో ఆగని నౌకల ప్రయాణం.. !
హోర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తూ దేశ ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత వ్యూహాత్మక, రహస్య సమన్వయ విధానం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగడంతో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురైంది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే జరుగుతుంది….
