AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి…
