Nepal: వందల మంది మృతి, వేల మంది గల్లంతు.. ఇంతటి విషాదంలోనూ ఆగని దోపిడి!
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామాలు, రహదారులు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 392 మంది మరణించినట్లు నిర్ధారించగా.. సరిహద్దుకు ఇరువైపులా కలిపి 1,468 మంది గల్లంతైనట్లు సమాచారం. మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. భారీగా పెరుగుతున్న గల్లంతైన వారి సంఖ్య నేపాల్ విపత్తు సంస్థ గురువారం వెల్లడించిన వివరాల…
