షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!
సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి పండుగ మొదలైంది. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదనపు సన్నివేశాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు శంకరవరప్రసాద్ చిత్రం కూడా థియేటర్లలోకి గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రవేశించింది. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ ట్రేసా వంటి తారలు స్క్రీన్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరవరప్రసాద్ విడుదలైన మరుసటి రోజే “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టీం కూడా వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ సినిమా కూడా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు….
