Mukhalingeswara Swamy Temple: మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!
బుధవారం జరిగిన నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.పార్వతి, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు శ్రీముఖలింగం క్షేత్రం నుండి భారీ ఊరేగింపుగా నంది వాహనంపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారనదీ తీరంలోని మిర్యాపల్లి రేవుకు చేరుకున్నాయి. అక్కడ వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఉత్సవ మూర్తులకు నదిలో త్రిశూల చక్రతీర్థ స్నానం ఆచరించారు.నదీ గర్భం మధ్యలో ఎగువున ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరులు స్నానమాడగా నదిలో దిగువ బాగాన…
