ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బ్రిజేష్ గోయల్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ట్యాక్సులు విధిస్తున్నాయి. ఢిల్లీలో చూసుకుంటే మే 22వ తేదీ నాటికి పెట్రోల్ అసలు ధర రూ.66.29గా ఉండగా.. ఎక్సైజ్ సుంకం రూ.11.90, వ్యాట్ రూ.16.03, డీలర్ మార్జిన్ రూ.4.42గా ఉంది.
