ఆంధ్రప్రదేశ్కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.
