ఒక సంచలనం, కేవలం సినిమా పేరు కాదు. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మొదటి భాగం 2013లో విడుదలై మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్తో నిర్మితమై భారీ వసూళ్లను సాధించి, తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భారతీయ భాషలలో రీమేక్ అయింది. దృశ్యం 2 కోవిడ్ సమయంలో ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు, దృశ్యం 3 రాకతో మలయాళ, హిందీ వెర్షన్ ట్రైలర్లలో భిన్నత్వం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పనోరమా స్టూడియోస్ అధినేతలు కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ స్పష్టతనిచ్చారు. హిందీ వెర్షన్ మలయాళ చిత్రానికి ఫ్రేమ్-టు-ఫ్రేమ్ రీమేక్ కాదని, కథా గమనం, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్లో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?
ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?
