ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, బాలకృష్ణతో నిప్పు రవ్వ చిత్రం తర్వాత కలిసి నటించకపోవడం, తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న నేపథ్యాలను ఆమె వివరించారు. చిరంజీవి, బాలకృష్ణలతో దాదాపు ఒకే సంఖ్యలో సినిమాలు చేశానని విజయశాంతి తెలిపారు. అయితే, నిప్పు రవ్వ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కథలు కుదరకపోవడం లేక ఇతర కారణాలు కాదని ఆమె స్పష్టం చేశారు.
