తాజావార్తలు

Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..


Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

తనికెళ్ళ భరణి సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కీలక మలుపులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (శ్రీను)తో తన అనుబంధాన్ని ప్రస్తావించారు. నువ్వే నువ్వే చిత్రం నుండి త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్న తాను, ఇటీవల కొన్ని చిత్రాల్లో డేట్ల సమస్యల వల్ల నటించలేకపోయానని తెలిపారు. మిథునం సినిమా చేస్తున్నప్పుడు, చేయగలనా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు, త్రివిక్రమ్ తన ఇంటికి వచ్చి, “మీరు తీసే రాంగ్ షాట్లే నాకు కావాలి. రాంగ్ అని మీకు ఎట్లా తెలుసు? ఇయ్యండి” అంటూ ధైర్యం చెప్పిన సంఘటనను భరణి గుర్తుచేసుకున్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, కొన్ని పాత్రలు ఇవ్వకపోయినా, గాయం వంటి చిత్రాలలో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. తన కెరీర్‌లో ఒకే ఒక్క వ్యక్తితో ఒక సంవత్సరం పాటు వైరం, మానసిక క్షోభ అనుభవించానని భరణి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ” ఈ సంఘటన కోనసీమ కుర్రోడు చిత్రం సమయంలో జరిగింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అర్జున్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం
నాకు వచ్చింది. రవిరాజా పినిశెట్టి, “కామెడీలో నాకు పెద్దగా పట్టు లేదు” అని చెప్పగా, నేను ఉత్సాహంగా “కామెడీ? ఎడం చేత్తో రాస్తా” అని సమాధానం ఇచ్చాను. అప్పటికే ఆయన కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు ద్వారా కామెడీ రైటర్‌గా గుర్తింపు పొందాను” అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

అయితే, రచయిత దివాకర్ బాబు నుండి ఫోన్ కాల్ ద్వారా భరణికి షాకింగ్ నిజం తెలిసింది. ఆ సినిమాకి రచయిత సత్యమూర్తి అప్పటికే సగం స్క్రిప్ట్ రాసి, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని దివాకర్ బాబు వెల్లడించారు. సత్యమూర్తి పరిస్థితి చూసి, భరణి ఆయన్ని పర్మిషన్ అడగడం కూడా కష్టమైంది. సత్యమూర్తి సీనియర్, రఫ్ అండ్ టఫ్ వ్యక్తి కావడంతో, ఆయన కోపానికి భరణి భయపడ్డారు. ఆ భయంతోనే సినిమా సంభాషణలు రాశారు. సినిమా విడుదలై, సూపర్ హిట్ అయింది. ప్రతి అక్షరం తనదే అయినా, కథ తనది కాదని, డైలాగులు మాత్రమే తాను రాశానని భరణి స్పష్టం చేశారు. చిత్రానికి మంచి గుర్తింపు, డబ్బు వచ్చినా, సత్యమూర్తిని ఎదుర్కొనే ధైర్యం లేక ఒక సంవత్సరం పాటు తీవ్ర భయంతో జీవించారు. సత్యమూర్తి తనకు ఫోన్ చేసినప్పుడు, ఎదుర్కోవడానికి అల్యూమినియం రాడ్ పట్టుకుని బాత్ రూమ్ లో దాక్కున్నానని భరణి పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

చివరకు, నారీ నారీ నడుమ మురారి సినిమా కోసం సత్యమూర్తితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో భరణి సత్యమూర్తిని కలిసి, తన అపార్థాన్ని వివరించి క్షమాపణ కోరారు. సత్యమూర్తి, “ఎవర్ని ఎవడు అడుగుతున్నాడుయ్యా నువ్వు” అంటూ భరణిని పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ సంఘటన తర్వాత, భరణి సత్యమూర్తిని గురువుగా భావించి, అద్భుతమైన పాత్రలను ఇష్టంగా చేశానని తెలిపారు. తన జీవితంలో భయం వల్ల, అకారణంగా తప్ప, ఇంకెవరితోనూ తనకు వైరం లేదని భరణి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *