
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నూతన జీవితానికి ప్రతీక అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాంతి, ఆనందం, ఐక్యత ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలు కరుణను ప్రేరేపించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మరోవైపు, సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ఈస్టర్ విజిల్ మాస్కు అధ్యక్షత వహించిన పోప్ లియో XIV, విశ్వాసులు భయం, అపనమ్మకం, అసమ్మతిని అధిగమించాలని కోరారు. ఈ సంఘర్షణలు మానవ హృదయాన్ని తీవ్రంగా కుంగదీస్తాయని, ప్రజలను, దేశాలను విభజించగలవని పోప్ లియో అభిప్రాయపడ్డారు. ఈ సంఘర్షణ వల్ల స్తంభించిపోవద్దని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈనాటికీ ఇంకా తెరవని సమాధులు ఉన్నాయని, వాటిని మూసి ఉంచే రాళ్లు ఎంత బరువుగా, ఎంత కట్టుదిట్టంగా కాపలా కాస్తాయంటే, అవి కదల్చడానికి వీలులేనట్లుగా కనిపిస్తాయని ఆయన అన్నారు.
‘‘ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈస్టర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటున్నారు.. ఈ కారణంగా ఈ ఈస్టర్ మరింత ప్రత్యేకమైంది. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరిలోనూ ఆశను, నవచేతనను, కరుణను ప్రేరేపించాలని అభిలషిస్తున్నాను. సర్వత్రా ఆనందం, సామరస్యం విస్తరించుగాక’’ అని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Greetings on Easter. This sacred day celebrates hope and renewal. May it bring peace, joy and brightness to everyone’s lives. May the teachings of Jesus Christ inspire all to be kind and strengthen the spirit of togetherness in society.
— Narendra Modi (@narendramodi) April 5, 2026
మరోవైపు, అవిశ్వాసం, భయం, స్వార్థం, కలహాలు వంటి కొన్ని భారాలు మానవ హృదయాన్ని తీవ్రంగా కుంగదీస్తాయని, అయితే ఈ అంతర్గత సంఘర్షణల నుండి పుట్టిన మరికొన్ని భారాలు యుద్ధం, అన్యాయం, ప్రజలు-దేశాల విభజన ద్వారా మన సంబంధాలను క్షీణింపజేస్తాయని పోప్ అన్నారు. ఈ భారాల వల్ల మనం స్తంభించిపోకుండా చూసుకుందాం. పోప్ లియో ఈ ప్రకటనను X అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్లో చేశారు.
Even today there are tombs to be opened, and often the stones sealing them are so heavy and so closely guarded that they seem to be immovable. Some weigh heavily on the human heart, such as mistrust, fear, selfishness and resentment; others, stemming from these inner struggles,…
— Pope Leo XIV (@Pontifex) April 4, 2026
క్రైస్తవ మతంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఈస్టర్ను ప్రపంచవ్యాప్తంగా ఆనందంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకోవడానికి చర్చిలు ప్రత్యేక ప్రార్థనలు, సేవలు మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆయన సిలువ వేయబడి, మూడవ రోజున సమాధి నుండి తిరిగి లేచారని క్రైస్తవుల నమ్మకం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
