కావాల్సిన పదార్దాలు : అర కిలో బోన్లెస్ చికెన్, ఒక కప్పు వేరుశెనగ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సరిపడా ఉప్పు , నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, పసుపును తీసుకోవాలి.
చికెన్ ను బాగా ఉదిలించాలి : ముందుగా కడిగి శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకుని పాన్లో వేసి, నీళ్ళు మొత్తం పోయే వరకు మీడియం మంట పై ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
వేయించడం: మళ్ళీ పాన్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఉడికించిన చికెన్ ను వేసి అది ఎర్రగా అయ్యే వరకు స్టవ్ మీదే బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.4
మసాలా వేయడం: వేరే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అలాగే దానిలో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది రంగు మారే వరకు బాగా వేయించి పెట్టుకోవాలి. దానిలో అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, మెంతులు పొడి, ఆవాల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఈ మసాలా మిశ్రమం చల్లారిన తర్వాత ముందుగా వేయించిన చికెన్ ముక్కలు, నిమ్మరసం వేసి దానిని బాగా కలుపుకోవాలి.
చివర్లో పాన్ తీసుకుని నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు ఆకులు , వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చడిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి





