ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు అందరూ పీఎఫ్ సౌకర్యం కలిగి ఉంటారు. దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైనేషన్(EPFO) అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ నుంచి పీఎఫ్ విత్ డ్రా మరింత సులువు కానుంది.
