అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్
బీఆర్ఎస్, కేసీఆర్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారన్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా అని సీఎం ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.. చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారని…
