సూటిపోటి మాటలతో ఎగతాళి చేసి, దాడికి పాల్పడ్డ తోటి విద్యార్థులు.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య!
ఉత్తరప్రదేశ్లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘాజీపూర్లో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలివైన విద్యార్థిని, చదువుల్లోనూ చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. అయితే పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆమెను ఎగతాళి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి…
