దాదాపు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేశారు. వీరు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 24వ తేదీన మనీలాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ చట్టపరమైన సంస్థల అధికారులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేశారు. తమ వద్ద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని వారిని బెదిరించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు నిరంతరం వారికి వీడియో కాల్స్ చేసి అనుక్షణం నిఘా పెట్టారు. వారు బయటికి వెళ్లినా సరే.. వేరే వారికి ఫోన్ చేసినా వెంటనే వీడియో కాల్ చేసి బెదిరింపులకు గురి చేసేవారు.
మరిన్ని వీడియోల కోసం :
