Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు
ఏలూరు, జులై 16: మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పేందుకు, మనుషుల మధ్య ఉండే పగ ప్రతీకారాలకు అమాయక మూగజీవాలు బలవుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచే ఒక అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి పశువులపై గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. సూరాపురం గ్రామానికి చెందిన ఉడతల అమ్మిరాజు అనే పాడి రైతు జీవనాధారం కోసం గేదెలను పెంచుకుంటున్నారు….
