తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే దుష్పరిపాలన నుండి రాష్ట్రం స్వేచ్ఛ, మార్పును కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడును అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహితంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. తమిళనాడు పర్యటనలో ఉన్న…
