ఇరాన్ బిగ్ షాక్.. ఆయిల్ రవాణా కోసం కొత్త మార్గం తెరిచిన సౌదీ!
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, హోర్ముజ్ జలసంధిలో ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించడం ప్రారంభించింది. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు నుంచి ముడి చమురు ట్యాంకర్లు భారత పోర్టుల వైపు ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు ఎక్కువ భాగం…
