కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్ ఫైట్ కాకపుట్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు…
