నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ
పాలు, నూనె వంటి నిత్యావసర వస్తువులే కాకుండా, ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కిరాతకులు. ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించిన ఈ మాయదారి మందుల దందా ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో ఒక నకిలీ మందుల తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. పెద్దమొత్తంలో నకిలీ మాత్రలు, సిరప్లు, ఖాళీ సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది నిందితులను…
