పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
పోలీసులమంటూ అమాయక ప్రజలను మోసం చేసి బంగారం దోచుకుంటున్న నయా ముఠా పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందంటూ బంగారాన్ని తీయించి కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ ముఠా చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం రద్దీ…
