Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో, అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి…
