High Court: చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
దేశంలో జరుగుతున్న నేరాలపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో నేరస్థుల పట్ల చట్టాలు కఠినంగా లేకపోవడం కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. అందుకే జనాలు భయం లేకండా చాలా ఈజీగా నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు లభించిన హక్కులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని.. 23 ఏళ్ల అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఆర్….
