Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..
తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్లో ప్రతీ 3 నిమిషాల 40 సెకన్లకు మెట్రో రైలు తిప్పనుండగా…..
