Telangana: రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు
చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు పురాతన ఆలయాలకు నిలయం రాచకొండ. రాజులు గతించారు. రాచరికాలు అంతరించినా.. అలనాటి చారిత్రకకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కాకతీయుల తర్వాత రాచకొండ ప్రాంతంలో రేచర్ల పద్మ నాయకులు వెలమ వంశీయులు రాజ్యమేలారు. ముఖ్యంగా రాచకొండ గుట్టపై ఉన్న చారిత్రక ప్రదేశం ‘భోగిని మండపం’, దీనిని స్థానికులు “భోగందాని మంచం” అని పిలుస్తారు. సుమారు 600 ఏళ్ల క్రితం నాటి రేచర్ల పద్మనాయక రాజు సింగ…
