కడుపు నొప్పి, విరేచనాలు: గుమ్మడి గింజల్లో డైటరీ ఫైబర్ (పీచుపదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, ఒకేసారి పెద్ద మొత్తంలో గుమ్మడి గింజలను తింటే అది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.
అవాంఛిత బరువు పెరుగుదల: బరువు తగ్గాలనుకునే వారు గుమ్మడి గింజలను తింటుంటారు. కానీ, వీటిలో క్యాలరీలు, కొవ్వు శాతం కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని స్నాక్స్ లాగా పరిమితి లేకుండా తింటూ పోతే, శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది.
అలెర్జీలు, బీపీ తగ్గడం: కొంతమంది శరీర తత్వానికి గుమ్మడి గింజలు పడవు. అలాంటి వారిలో ఇది అలెర్జీని కలిగిస్తుంది. దీనివల్ల గొంతు నొప్పి రావడం, నిరంతరం తుమ్ములు రావడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, ఇవి రక్తపోటును (Blood Pressure) తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, ఇప్పటికే లో-బీపీ ఉన్నవారు లేదా బీపీ టాబ్లెట్లు వాడేవారు వీటిని ఎక్కువగా తింటే బీపీ మరింత పడిపోయే ఛాన్స్ ఉంది.
గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం: గుమ్మడి గింజలు పరిమాణంలో చిన్నగా, కొద్దిగా గట్టిగా ఉంటాయి. చిన్న పిల్లలకు వీటిని నేరుగా ఇవ్వకూడదు, ఎందుకంటే అవి గొంతులో ఇరుక్కుపోయే (Choking Hazard) ప్రమాదం ఉంది. పెద్దలు కూడా వీటిని తినేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి.
మ్మడి గింజలు ఆరోగ్యానికి మేలు చేయాలంటే వాటిని ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల (Tablespoons) కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం. ఏదైనా అమృతం అయినా అతిగా తింటే విషమే అవుతుందని గుర్తుంచుకోండి!





