Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
