Telangana: లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్కి బయలుదేరిన చిన్నారి.. కట్ చేస్తే ఊహించని ఘటనతో అంతా షాక్..
నిన్నటి వరకు కుక్కల భయంతో వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కోతుల గుంపు మరోసారి పంజా విసిరింది. స్కూల్కి వెళ్తున్న ఆరేళ్ల చిన్నారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన గౌడి చిన్న ముత్యాలు కుమార్తె జోష్ణవి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతోంది. బుధవారం ఉదయం ఆ చిన్నారి టిఫిన్ బాక్స్…
