Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్న్యూస్.. నేటి నుంచి రూ.20కే పంపిణీ.. లబ్దిదారులకు పండుగే..
ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రూ.20కే గోధుమ పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా.. త్వరలో డివిజన్, మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనుంది. రేషన్ కార్డు ఉన్నవారికి ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. బయట మార్కెట్లో ఇంట్లోకి అవసరమయ్యే గోధుమ కొనాలంటే…
