Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…
