మనలో చాలా మంది కొత్త డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, అసలు ఇలా వేసుకోవడం మంచిదేనా? కొన్ని సార్లు అయితే ఏం కాదు కానీ, మరి కొన్ని సందర్భాల్లో అయితే ఇది ప్రమాదకరంగా మారనుంది. అంతేకాదు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కొత్త డ్రెస్లు ఉతకకుండా వేసుకోవడం వలన చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, షాపింగ్ మాల్స్ లో అందరూ చేసే పని ఇది. బట్టల షాప్ లోకి వెళ్ళగానే ట్రైల్స్ వేస్తారు.
ఎందుకంటే, వీటి తయారీకి అనేక రంగులు వాడుతారు. ఇంకా వీటిలో ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు కూడా వాడతారు. ఇవి అంత మంచివి కావు. కాబట్టి, వీటిని వేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి వేసుకోండి.
ఇంకా చాలా మంది షోరూమ్లలో ట్రయల్ వేస్తారు. దీని వలన చర్మ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా, పిల్లల చర్మం సెన్సిటివ్ కాబట్టి, వారికి ఇలాంటి దుస్తులను ఉతికిన తర్వాతే వేయండి లేదంటే అనారోగ్య మస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)





