కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, మూడు కప్పుల పాలు – 2 కప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పంచదార, రుచికి తగినంత కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.
ముందుగా ఎండు కొబ్బరిని రెడీ చేసుకోవాలి: ఎండు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా పాలు లేదా అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా బాగా రుబ్బుకుని, దాని నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి.2
వీటిని బాగా వేయించుకోవాలి : గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేసి వాటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
4
పాయసాన్ని బాగా ఉడికించుకోవాలి : అదే పాన్లో కొంచం పాలు, ఎండు కొబ్బరి నుంచి తీసిన పాలను కూడా పోసి పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత బెల్లం తురుమును కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
ఇది చల్లబడిన తర్వాత, దీనిలో వేయించిన జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే , టేస్టీ ఎండు కొబ్బరి పాయసం రెడీ .





