
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు, కన్నడ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా హీరో రణబీర్ కపూర్ నటించగా సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణం సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా సినిమా పై అంచనాలను తార స్థాయికి చేర్చాయి.
సమంతను హీరోయిన్గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు.. షాకింగ్ విషయం చెప్పిన సుకుమార్
కాగా ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా కనిపించారు. రాముడి పాత్రలో రణబీర్ సూపర్ గా సెట్ అయ్యాడు. అలాగే సీతగా సాయి పల్లవి కూడా సెట్ అయ్యింది. ఇక రావణుడిగా యశ్ లుక్ ను రివీల్ చేయలేదు. ఈ సినిమాకు యశ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రామాయణం సినిమా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతుంది.
రూటు మార్చిన ముద్దుగుమ్మ.. గ్లామర్ గేట్లు ఎత్తేసిన కుర్ర భామ
కాగా ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ పాత్రకోసం చందమామ కాజల్ అగర్వాల్ ను అనుకున్నారని టాక్. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి రకుల్ ఎంట్రీ ఇచ్చింది. సీత కంటే శూర్పణఖ అందంగా ఉంటుందని కాజల్ ను తప్పించారని బీ టౌన్ లో టాక్. ఆమె ప్లేస్ లోకి రకుల్ నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
Tollywood : ఆ ఇద్దరు హీరోల పక్కన కూతురిగా చేశా.. హీరోయిన్గానూ చేశా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
