కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ఒక నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు మహిళల బృందంలో ఒకరు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన పి. గన్నవరం నగల దుకాణంలో జరిగింది. నలుగురు మహిళలు ఒకేసారి షాపులోకి వచ్చి, సిబ్బందితో నగలు కావాలంటూ మాటలు కలిపారు. అది చూపించమని, ఇది చూపించమని చెబుతూ నలుగురు నాలుగు దిక్కుల నుంచి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బంగారు నగలను దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే, దుకాణం యజమాని అత్యంత అప్రమత్తంగా ఉండటంతో మహిళల దొంగతనం ప్రయత్నాన్ని సకాలంలో పసిగట్టారు. దీంతో మహిళలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన యజమాని, చుట్టుపక్కల ప్రజల సహాయంతో పారిపోతున్న మహిళల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన సీసీటీవీ దృశ్యాలలో స్పష్టంగా రికార్డయ్యింది. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??
మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు
పాత నోట్ల మార్పిడి వెనుక రాజకీయ నేతల హస్తం..?
Allu Arjun: ఆ తప్పు రిపీట్ అవ్వదంటున్న అల్లు అర్జున్
ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది
